ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ తీవ్రత కొనసాగుతున్నది. గడచిన 24 గంటల్లో కొత్తగా 10,418 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 5,27,512కు చేరింది. ప్రస్తుతం 97,271 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు 4,25,607 మంది కోలుకున్నారు. కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 4634కు పెరిగింది. గడచిన 24 గంటల్లో 9,842 మంది కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇవాళ్టి వరకు రాష్ట్రంలో 43,08,762 శాంపిల్స్ పరీక్షించారు.
