అట‌వీ భూముల‌కు ధ‌ర‌ణి పోర్ట‌ల్‌లో ప్ర‌త్యేక కాల‌మ్ : సీఎం కేసీఆర్

కొత్త రెవెన్యూ చ‌ట్టంలో భాగంగా తీసుకువ‌చ్చిన ధ‌ర‌ణి పోర్ట‌ల్‌లో అట‌వీ భూముల‌కు ప్ర‌త్యేక కామ్ పెడుతున్నామ‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌క‌టించారు. కొత్త రెవెన్యూ చ‌ట్టంపై శాస‌న‌స‌భ‌లో సీఎం కేసీఆర్ వివ‌ర‌ణ ఇచ్చారు. ఆర్‌వోఎఫ్ఆర్ భూముల విష‌యంలో కూడా గ‌త పాల‌కులు ఓ రాజ‌కీయ దందా చేశారు. ఏ పార్టీ వారైనా అడ‌వి బిడ్డ‌ల‌కు అన్యాయం చేయొద్దు. అడ‌వుల యాక్ట్ సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ ప‌రిధిలోనిది. ఇది కూడా ఓ రాజ‌కీయ దందా. అడ‌వి బిడ్డ‌ల‌కు కూడా రైతుబంధు ఇచ్చామ‌న్నారు. ప్ర‌జ‌ల‌ను మోసం చేసే అల‌వాటు త‌మ‌కు లేద‌న్నారు. అట‌వీ భూముల్లో పంట చేసుకునే వారు ఆ భూముల‌కు ఓన‌ర్లు కాదు. ఆర్‌వోఎఫ్ఆర్ భూముల‌కు ధ‌ర‌ణి పోర్ట‌ల్లో ప్ర‌త్యేక కాలం పెడుతామ‌న్నారు. ఆర్‌వోఎఫ్ఆర్ భూముల‌ను త‌ప్ప‌కుండా ర‌క్షిస్తాం. ఇప్ప‌టికే ప‌ట్టాలు ఇచ్చిన గిరిజ‌న భూముల జోలికి వెళ్ల‌మ‌ని సీఎం స్ప‌ష్టం చేశారు. ఇత‌ర రైతులు పొందే ల‌బ్ధి కూడా ఈ గిరిజ‌న రైతుల‌కు వ‌ర్తిస్తుంద‌న్నారు. పోడు భూముల‌పై త్వ‌ర‌లోనే చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకుంట‌మ‌న్నారు. పోడు భూముల్లో వ్య‌వ‌సాయం చేసుకుంటున్న రైతుల‌కు ర‌క్ష‌ణ క‌ల్పిస్తాం. ఒక్క గుంట కూడా అట‌వీ భూమిని క‌బ్జా కానివ్వ‌మ‌ని సీఎం చెప్పారు.