తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 2,278 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,54,880కి చేరింది. వైరస్తో 10 మంది మృతి చెందగా, మొత్తం 950 మంది మృత్యువాతపడ్డారు. తాజాగా 2,458 మంది వైరస్ నుంచి కొలుకోగా, 1,21,925 మంది ఇండ్లకు చేరారు. ప్రస్తుతం రాష్ట్రంలో 32,005 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ చెప్పింది. మరో 25,050 మంది హోం ఐసోలేషన్లో ఉన్నట్లు తెలిపింది. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.61శాతం ఉండగా, దేశంలో 1.66 శాతంగా ఉందని చెప్పింది. అలాగే రికవరీ రేటు 78.7శాతంగా ఉందని, ఇది దేశ సగటు (77.75) కంటే ఎక్కువని పేర్కొంది. శుక్రవారం 62,234 శాంపిల్స్ పరీక్షించగా, ఇప్పటికీ 20,78,695 నమూనాలను పరిశీలించినట్లు తెలిపింది. ఇంకా 2,027 నమూనాల ఫలితాలు రావాల్సి ఉందని, పది లక్షల జనాభాకు 55,989 మందికి టెస్టులు చేసినట్లు చెప్పింది. తాజాగా నమోదైన కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో 331 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. తర్వాత రంగారెడ్డి 184, మేడ్చల్ మల్కాజ్గిరి 150, నల్గొండ 126, కరీంనగర్ 121, వరంగల్ అర్బన్ 91, ఖమ్మం 98 కేసులు రికార్డయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ వివరించింది.
