టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్కుమార్ శ్రీకారం చుట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ దిగ్విజయంగా కొనసాగుతుంది. దేశ రాజధాని నగరంలో సైతం హరిత యజ్ఞం కొనసాగుతుంది. ఇప్పటికే పలువురు ఎంపీలు ఛాలెంజ్ను స్వీకరించి మొక్కలు నాటారు. ఈ క్రమంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగస్వామ్యమయ్యారు. ఓం బిర్లా నేడు పార్లమెంట్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎంపీలు సంతోష్కుమార్, కే.కేశవరావు, కొత్త ప్రభాకర్రెడ్డి, నామా నాగేశ్వరరావు పాల్గొన్నారు.
