ఏపీలో కొత్తగా 8,702 మందికి కరోనా పాజిటివ్

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతున్నది. గడచిన 24 గంటల్లో కొత్తగా 8,702 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా 72 మంది చనిపోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 6,01,462కు పెరిగింది. ఏపీలో ప్రస్తుతం 88,197 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటి వరకు 5,08,088 మంది కోలుకున్నారు. కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 5177కు చేరింది. గడచిన 24 గంటల్లో 10,712 మంది కొవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇవాళ్టి వరకు రాష్ట్రంలో 48,84,371 శాంపిల్స్‌ పరీక్షించారు.