తెలంగాణలో కొత్తగా 2,123 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,69,169కి చేరింది. కొత్తగా 2151 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 1,37,508 మంది ఇండ్లకు చేరుకున్నారు. తాజాగా మరో 9 మంది మృతి చెందగా, మొత్తం 1,025 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో 30,636 యాక్టివ్ కేసులున్నాయని, మరో 24,070 మంది హోం ఐసోలేషన్లో ఉన్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ పేర్కొంది. కాగా, రాష్ట్రంలో 0.60శాతం మరణాలు రేటు ఉండగా, రికవరీ రేటు 81.28శాతంగా ఉందని పేర్కొంది. నిన్న ఒకే రోజు 54,459 శాంపిల్స్ పరీక్షించగా, 1207 నమూనాల ఫలితాలు రావాల్సి ఉందని, ఇప్పటికీ మొత్తం 24,34,409 టెస్టులు చేసినట్లు వివరించింది. పదిలక్షల జనాభాకు 65,570 పరీక్షలు చేసినట్లు తెలిపింది. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా హైదరాబాద్ జీహెచ్ఎంసీలో 305 నిర్ధారణ అయ్యాయి. తర్వాత రంగారెడ్డి 185, మేడ్చల్ మల్కాజ్గిరి 149, నల్గొండ 135, కరీంనగర్ 112, సిద్దిపేటలో 87, వరంగల్ అర్బన్ జిల్లాలో 81 పాజిటివ్ కేసులు రిక్డారయ్యాయని వివరించింది.
