తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 2,072 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో ఒక్క గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే 283 నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో1,89,283 కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా, వైరస్ ప్రభావంతో ఇవాళ తొమ్మిది మృతి చెందగా, మొత్తం మరణించిన వారి సంఖ్య 1,116కు చేరింది. ఇవాళ 2,259 మంది వైరస్ నుంచి కోలుకొని ఇళ్లకు వెళ్లగా, మొత్తం1,58,690 మంది డిశ్చార్జి అయ్యారు.
మరో 29,477 మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. 23,934 మంది హోం ఐసోలేషన్లో ఉంటున్నారు. రాష్ట్రంలో కరోనా మరణాలు 0.58 శాతంగా ఉండగా రికవరీ రేటు 83.88 శాతంగా ఉందని వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 54,308 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటివరకు 29,40,642 పూర్తి చేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ తన నివేదికలో వివరించింది.