తెలంగాణలో కొత్తగా 1,949 కరోనా పాజిటివ్ కేసులు

గడిచిన 24 గంటల్లో తెలంగాణ రాష్టంలో కొత్తగా 1,949 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో కేవలం హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోనే 291 నమోదయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,99,276 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా, వైరస్‌ ప్రభావంతో ఇవాళ 10 మంది మృతి చెందగా మొత్తం మరణించిన వారి సంఖ్య 1,163కు చేరింది. గడిచిన 24 గంటల్లో 2,366 మంది చికిత్సకు కోలుకొని ఇండ్లకు వెళ్లగా మొత్తం 1,70,212 మంది డిశ్చార్జి అయ్యారు. మరో 27,901 మంది దవాఖానల్లో చికిత్స పొందుతుండగా.. హోం ఐసోలేషన్‌లో 22,816 మంది ఉన్నారు.