అడవుల సంరక్షణకు కృషి చేయాలి : అటవీ, పర్యావరణ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో అడవుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. నిర్మల్‌, ఆదిలాబాద్‌ జిల్లాలకు చెందిన ఐఎఫ్‌ఎస్‌ అధికారులు నీరాజ్‌కుమార్‌ టిబ్రెవల్‌, నవీన్‌రెడ్డి మంత్రిని ఆదివారం  మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రికి మొక్కలను అందజేశారు. నిర్మల్‌, ఆదిలాబాద్‌ జిల్లాలకు ఐఎఫ్‌ఎస్‌లను నియమించారని, అధికారులు అడవుల సంరక్షణను మరింత పకడ్బందీగా నిర్వహించాల్సి ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. మంత్రిని కలిసిన వారిలో నిర్మల్‌ డీఎఫ్‌వో సుతన్‌, ఎఫ్‌ఆర్వో జైపాల్‌రెడ్డి ఉన్నారు.