ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్గా పెండ్ర వీరన్న ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పెండ్ర వీరన్న ఆదివారం మీడియాతో మాట్లాడుతూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా సంచార జాతులకు చెందిన వ్యక్తిని స్టేట్ ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటాం. మాట తప్పని మడమ తిప్పని నాయకుడు అనడానికి ఇదే నిదర్శనం. ప్రజా సంకల్ప యాత్రలో సంచార జాతులకు వైభవం తీసుకు వచ్చే కార్యక్రమాలు చేపడతాం అని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి అయిన వెంటనే సంచారజాతులకు న్యాయం జరిగే విధంగా కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వడం చరిత్రలో నిలిచిపోతుంది. గత ప్రభుత్వాలు బీసీ కులస్తులను మభ్యపెట్టి మోసం చేశారు. నాపై నమ్మకంతో పదవి కట్టబెట్టిన సీఎం జగన్కు, వైఎస్సార్సీపీకి వన్నె తెస్తాను. అని పేర్కొన్నాడు.
