నాలుగు లక్షల కుటుంబాలకు ఆర్థిక సాయం : మంత్రి కేటీఆర్‌

భారీ వర్షాల కారణంగా నష్టపోయిన బాధిత కుటుంబాలకు మంగళవారం నుంచి ఆర్థిక సాయం పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారకారామారావు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు జీహెచ్‌ఎంసీ, శివారు ప్రభావిత ప్రాంతాల్లో మూడు నుంచి నాలుగు లక్షల కుటుంబాలకు ఇండ్ల వద్దనే రూ.10వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే సీఎంఆర్‌ఎఫ్‌ నుంచి రూ.550 కోట్లు కేటాయించారని, అవసరమైతే ఇంకా సహాయం అందజేస్తామని సీఎం ప్రకటించారన్నారు. ప్రతి బాధిత కుటుంబానికి సహాయం అందాలని సీఎం సూచించారన్నారు. సంక్షోభ సమయంలో ఎమ్మెల్యే, కార్పొరేటర్లు, ఎన్జీవోలు, ఇతర ప్రజాప్రతినిధులు ముందుకు వచ్చి ముంపు బాధితులకు అండగా నివాలని మంత్రి కేటీఆర్‌ కోరారు.