ప్లాట్లు, అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణకు (ఎల్ఆర్ఎస్) ప్రభుత్వం చేపట్టిన ఎల్ఆర్ఎస్ దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని అక్రమ, అనధికార లేఅవుట్లు, పాట్ల క్రమబద్ధీకరణను తప్పనిసరిచేస్తూ ఆగస్టు 31న రాష్ట్రప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. దీంతో రాష్ట్రవాప్తంగా ఎల్ఆర్ఎస్కు భారీ స్పందన వచ్చింది. నిన్నటివరకు 24,14,337 లక్షల దరఖాస్తులు వచ్చాయి. నిన్న ఒక్కరోజే 70 వేలకుపైగా మంది ఎల్ఆర్ఎస్కోసం అప్లయ్ చేసుకున్నారు. ఈనెల 15న దరఖాస్తుల గడువు ముగిసింది. అయితే రాష్ట్రంలో వర్షాలు, పలు కారణాల దృష్ట్యా మరో 15 రోజులపాటు దరఖాస్తు గడువు పొండిగించింది. ఇప్పటివరకు గ్రామపంచాయతీల్లో 10,17,293 దరఖాస్తులు రాగా, మున్సిపాలిటీల్లో 10,02,325, కార్పొరేషన్లలో 3,94,719 దరఖాస్తులు వచ్చాయి. ఈరోజు లక్ష వరకు దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనావేస్తున్నారు. కాగా, సాదాబైనామాల క్రమబద్ధీకరణకు మరో వారం పాటు గడువు ఉన్నది.
