
రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించిన జోగులాంబ గద్వాల్ జిల్లా టి.ఆర్.ఎస్ మహిళ నాయకురాలు, ఎం.ఎల్.ఏ. సతీమణిబురెడ్ పల్లె గ్రామ సర్పంచ్ బండ్ల జ్యోతి కృష్ణమోహన్ రెడ్డి
సర్పంచ్ బండ్ల జ్యోతి గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ రాష్ట్రలొనే కాకుండా దేశ వ్యాప్తంగా మొదలు పెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు మంచి విశేష స్పందన వచ్చిందన్నారు . ఇందులో భాగంగా జోగులంబా గద్వాల్ జిల్లా ధరూర్ మండలం బూరెడ్ పల్లె గ్రామంలో సర్పంచ్ బండ్ల జ్యోతి మూడు మొక్కలు నాటుతూ మరో ముగ్గురికి 1. గుడ్డేమ్ దొడ్డి గ్రామ సర్పంచ్ రఘు రెడ్డి, 2. చింత రేవుల గ్రామ సర్పంచ్ ప్రభాకర్ గౌడ్ , 3. దాసర పల్లె గ్రామ సర్పంచ్ భరత్ లకు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నా కో.ఫౌండర్ రాఘవ , ప్రతినిధి కిషోర్ గౌడ్ ను ప్రత్యేకంగా అభినందిస్తున్నానని సర్పంచ్ జ్యోతి తెలిపారు.