ఇవాళ ఖైరతాబాద్‌, జూబ్లీహిల్స్‌ నియోజకవర్గాల్లో మంత్రి కేటీఆర్‌ ప్రచారం

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారాన్ని టీఆర్‌ఎస్‌ విస్తృతం చేసింది. గత గ్రేటర్ ఎన్నికల్లో అన్నీ తానై టీఆర్ఎస్‌ను గెలిపించిన కేటీఆర్.. ఈసారి కూడా గెలుపు బాధ్యతను తన భుజాలపై వేసుకున్నారు. అన్నితానై పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నారు.  ఈ నెల 30వ తేదీ వరకు జీహెచ్‌ఎంసీ పరిధిలోని 20 నియోజకవర్గాల్లో మంత్రి కేటీఆర్‌ రోడ్‌షోలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలిసింది. శనివారం కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలో రోడ్‌ షోతో కేటీఆర్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. అనంతరం కూకట్‌పల్లిలో ప్రచారం నిర్వహించి.. సాయంత్రం 5 గంటలకు ఓల్డ్‌ అల్లాపూర్‌ చౌరస్తా, చిత్తారమ్మ తల్లి చౌరస్తా, రాత్రి 7గంటలకు ఐడీపీఎల్‌ చౌరస్తా, 8 గంటలకు సాగర్‌ హోటల్‌లో జంక్షన్‌లో ప్రచారం నిర్వహించారు.  ఆదివారం మంత్రి కేటీఆర్‌ ఖైరతాబాద్, జూబ్లీహిల్స్‌ నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించనున్నారు.  

కేటీఆర్‌ షెడ్యూల్‌ ఇలా..  

ఖైరతాబాద్‌ నియోజకవర్గం :  జహీరానగర్ చౌరస్తాలో సాయంత్రం 4 గంటలకు, ఖైరతాబాద్‌ లైబ్రరీ చౌరస్తాలో 5 గంటలకు రోడ్డుషోలో పాల్గొంటారు.   

జూబ్లీహిల్స్ నియోజకవర్గం : శ్రీరామ్ నగర్ చౌరస్తాలో సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు.. యూసఫ్ గూడ చెక్ పోస్ట్ చౌరస్తాలో రాత్రి 7:30 గంటలకు మంత్రి కేటీఆర్‌ రోడ్డు షోలో పాల్గొంటారు.