గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మూడు మొక్కలు నాటిన వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ

ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్ ని స్వీకరిస్తూ వికారాబాద్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో మూడు మొక్కలు నాటిన జిల్లా ఎస్పీ నారాయణ. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ మానవాళికి కావలసిన ఆక్సిజన్ ఉత్పత్తి చేసే చెట్లను నాటే కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ సంతోష్ కుమార్ ని అభినందించారు, మనం చెట్ల మీద ఆధారపడే జీవులుగా తెలిపారు. మొక్కలు లేకపోతే మానవాళి మనుగడ లేదు అందుకోసం వాటిని ప్రతి ఒక్కరూ నాటి , పెరిగే వరకు బాధ్యత తీసుకోవాలని కోరారు. ఇందులో అందరూ స్వంచందంగా పాల్గొని మనిషికి మూడు మొక్కలు నాటాలని తెలిపారు. ఇందులో భాగంగా మరో ముగ్గురు డీఎస్పీ లకు ఛాలెంజ్ ని ఇచ్చారు. వికారాబాద్ డిఎస్పి సంజీవరావు, తాండూర్ డిఎస్పి లక్ష్మినారాయణ, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులుకు చాలంజ్ ని నామినెట్ చేస్తున్నానని అన్నారు.