వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు పిలుపునిచ్చిన భారత్ బంద్ తెలంగాణలో కొనసాగుతోంది. బంద్కు అధికార టీఆర్ఎస్ పార్టీతో పాటు వామపక్షాలు మద్దతు తెలిపాయి. భారత్బంద్లో రాష్ట్రవ్యాప్తంగా ఆయా జిల్లాల పరిధిలోని ఆర్టీసీ బస్లు డిపోలకే పరిమితమయ్యాయి. తెల్లవారు జాము నుంచే డిపోల ఎదుట టీఆర్ఎస్, కాంగ్రెస్, వామపక్ష పార్టీల నేతలు నిరసన తెలిపారు.