భారత ఇంజనీర్‌కు ఐరాస పర్యావరణ అవార్డు

మనదేశానికి చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్త విద్యుత్‌ మోహన్‌ ప్రతిష్ఠాత్మక ‘యంగ్‌ చాంపియన్స్‌ ఆఫ్‌ ద ఎర్త్‌-2020’ అవార్డును గెలుచుకున్నారు. పర్యావరణ కాలుష్యాన్ని అడ్డుకోవడానికి పరిష్కారాలు చూపించేవారికి ఐక్యరాజ్యసమితి (ఐరాస) ఈ అవార్డును అందజేస్తుంది.