వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లపై నేడు సీఎం కేసీఆర్‌ సమీక్ష

వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ శనివారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. సీఎస్‌ సోమేశ్‌కుమార్‌తోపాటు రెవెన్యూశాఖ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాల కాపీ ఇంకా ప్రభుత్వానికి అందలేదు. కాపీ అందిన తర్వాత దీనిపై కూలంకషంగా చర్చించి తగిన నిర్ణయం తీసుకునేందుకు ఈ సమావేశం ఏర్పాటుచేశారు. హైకోర్టు నిర్ణయంపై సుప్రీం కోర్టుకు వెళ్లడమా? లేక తగిన విధానాలను రూపొందించి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ చేపట్టడమా? అనే అంశంపై రెవెన్యూ, న్యాయశాఖల నిపుణులతో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.