జాతీయ సహకార బ్యాంకుల సమాఖ్య చైర్మన్గా టెస్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు ఎన్నికయ్యారు. దేశంలోని 34 రాష్ట్ర సహకార బ్యాంకుల సమాఖ్యల చైర్మన్లు రవీందర్రావును ఎన్నుకున్నారు. ముంబాయిలో జరిగిన కార్యక్రమంలో ఈ ఎన్నిక జరిగింది. అంతకు ముందు కరీంనగర్ డీసీసీబీకి ప్రకటించిన ఫస్ట్ ఓవరాల్ బెస్ట్ ఫర్ఫామెన్స్, స్పెషల్ అవార్డులను నాబార్డ్ చైర్మన్ గోవింద రాజులు చేతుల మీదుగా రవీందర్రావు ఈ అవార్డులు అందుకున్నారు.