నటుడు నోయెల్ సేన్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొని మొక్కలు నాటారు. దేతడి హారిక ఇచ్చిన గ్రీన్ ఛాలెంజ్ను స్వీకరించిన నోయెల్ శనివారం శంషాబాద్లోని తన వ్యవసాయక్షేత్రంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొక్కలు మనకు చాలా చాలా అవసరం అన్నారు. వాతావరణ కాలుష్యం తగ్గాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు. ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చాలా అద్భుతమైన కార్యక్రమం అన్నారు. ఈ సందర్భంగా బిగ్ బాస్ 4 రియాల్టీ షో లో తనతో పాటు పాల్గొన్న సుజాత, కుమార్ సాయి, దీప్తి సునైనా, నాగవల్లి, రమ్య బెహ్రా, దివి లకు నోయెల్ గ్రీన్ ఛాలెంజ్ను విసిరారు.LikeCommentShare
