చినజీయర్ స్వామికి శ్రీవారి ప్రసాదాలు అందజేసిన టీటీడీ ఛైర్మన్‌

ధనుర్మాస మహోత్సవాలలో భాగంగా తాడేపల్లి మండలం సీతానగరంలోని విజయకీలాద్రి దివ్య క్షేత్రములో ఉన్న శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్  స్వామిని మంగళవారం టీటీడీ ఛైర్మన్‌  వైవీ  సుబ్బారెడ్డి కలిశారు. ఈ సందర్భంగా చినజీయర్ స్వామికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తీర్ధప్రసాదాలను సుబ్బారెడ్డి అందజేశారు. ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్ని రోజులుగా ఆలయాల్లోని విగ్రహాల ధ్వంసంపై  వీరిద్దరూ చర్చించుకున్నట్లు తెలిసింది.