ఎమ్మెల్సీ కవితను కలిసిన తెలంగాణ రాష్ట్ర ఒగ్గు కళాకారులు

తెలంగాణ రాష్ట్ర ఒగ్గు  కళాకారుల సంక్షేమ సంఘం ప్రతినిధులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను హైదరాబాద్‌లోని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఎమ్మెల్సీ కవిత ఆవిష్కరించారు. అనంతరం ఒగ్గు కళాకారులు బహూకరించిన తాళాన్ని కవిత కాసేపు వాయించారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు సింగారపు ఓదెలు, అధ్యక్షుడు ఒగ్గు ధర్మయ్య, ఇతర నాయకులు పాల్గొన్నారు.