పజ్జూరులో వ్యక్తి దారుణ హత్య

నల్లగొండ జిల్లాలోని తిప్పర్తి మండలం పజ్జూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. నాగయ్య అనే రైతును ప్రత్యర్థులు కర్రలతో కొట్టి చంపారు. భూ వివాదాలే నాగయ్య హత్యకు కారణమని స్థానికులు పేర్కొన్నారు. సంఘ‌ట‌న‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.