రేపు ఢిల్లీకి ఏపీ సీఎం జగన్‌

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో  కేంద్ర హోం మం‍త్రి అమిత్ షాతో సీఎం  జగన్ భేటీ కానున్నారు.  రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు, కీలక అంశాలపై  సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  పలువురు కేంద్ర మంత్రులతో కూడా జగన్‌ సమావేశం కానున్నట్లు తెలుస్తున్నది.