పటాన్‌చెరు పీఎఫ్‌ కార్యాలయంలో సీబీఐ తనిఖీలు.. ఉద్యోగిపై కేసు

పటాన్‌చెరు ఉద్యోగ భవిష్య నిధి (పీఎఫ్) కార్యాలయం ఉద్యోగి భారత్ రెడ్డి లంచం డిమాండ్ చేశారనే ఆరోపణలు రావడంతో సీబీఐ అధికారులు తనిఖీలు చేశారు. రూ.3 వేలు లంచం తీసుకున్నట్టుగా తేలడంతో అతడిని తనిఖీలు చేయగా నగదు లభించలేదు. కార్యాలయంలో వెతకగా డబ్బులు లభించడంతో కేసు నమోదు చేశారు. రాత్రి ఒంటి గంట సమయంలో అతన్ని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి తమ కార్యాలయానికి తరలించారు. పూర్తి వివరాలను సీబీఐ కార్యాలయం నుంచి సమాచారం ఇస్తామని ఓ అధికారి తెలిపారు. అధికారులు తమ పేర్లను చెప్పేందుకు నిరాకరించారు.