రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా నేడు సూర్యాపేట జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో మొక్కలు నాటిన ఎస్పీ భాస్కరన్ ఐపీఎస్ అధికారి. రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ పర్యావరణ పరిరక్షణకు తీసుకుంటున్న చొరవ అద్భుతమైనది అన్నారు . భవిష్యత్ తరాలకు చక్కటి గాలిని, మంచి వాతావరణం ఉండాలి అంటే మనం చెట్లు నాటడం అలవాటు చేసుకోవాలి. నాటిన ప్రతి మొక్కను కాపాడాలి . ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ కి ప్రత్యేక అభినందనలు తెలిపారు.