మెదక్, పెద్దపల్లి జిల్లాలకు నూతన కలెక్టర్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రంగారెడ్డి అదనపు కలెక్టర్ ఎస్.హరీశ్ను మెదక్ కలెక్టర్గా అదేవిధంగా సీఎంఆర్వో ప్రాజెక్టు డైరెక్టర్ ఎస్.సంగీత సత్యనారాయణను పెద్దపల్లి కలెక్టర్గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువరించింది. కాగా ప్రస్తుతం మెదక్ కలెక్టర్గా ఉన్న పి. వెంకట్రామిరెడ్డి, పెద్దపల్లి కలెక్టర్గా ఉన్న భారతీ హోళికేరీని ఆయా స్థానాల నుండి రిలీవ్ చేసింది.
