తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోసం షెడ్యూల్ విడుదలైంది. తెలంగాణలో రెండు పట్టభద్రుల, ఏపీలో రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ జారీ చేసింది. తెలంగాణలో ఖమ్మం – వరంగల్-నల్గొండ, మహబూబ్నగర్ – రంగారెడ్డి -హైదరాబాద్ పట్టభద్రుల స్థానాలకు ఈ నెల 16న ఎన్నికల నోటిఫికేషన్ జారీ కానుండగా.. మార్చి 14న పోలింగ్ జరుగనుంది. నామినేషన్ల స్వీకరణకు ఈ నెల 23వ తేదీ వరకు గడువు ఇచ్చారు. 24న నామినేషన్లను పరిశీలించన్నారు. 26న నామినేషన్ల ఉపసంహరణకు చివరి గడువు ఇచ్చారు. మార్చి 14న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. ప్రస్తుత ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎన్.రామచంద్రరావు పదవీకాలం మార్చి 29వ తేదీతో ముగియనుంది. ఏపీలోని ఉపాధ్యాయ నియోజకవర్గాలైన ఈస్ట్గోదావరి-వెస్ట్గోదావరి, కృష్ణా-గుంటూరు ఎమ్మెల్సీలు రాముసూర్యారావు, ఏఎస్రామకృష్ణ పదవీకాలం సైతం పూర్తికానుంది. ఈ క్రమంలోనే కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.
ఎన్నికల ప్రక్రియ ఇలా..
నోటిఫికేషన్ విడుదల : ఫిబ్రవరి 16 (మంగళవారం)
నామినేషన్లకు చివరితేదీ : ఫిబ్రవరి 23 (మంగళవారం)
నామినేషన్ల పరిశీలన : ఫిబ్రవరి 24 (బుధవారం)
నామినేషన్ల ఉపసంహరణకు చివరితేదీ : ఫిబ్రవరి 26 (శుక్రవారం)
పోలింగ్: మార్చి 14 (ఆదివారం) ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు
ఓట్ల లెక్కింపు : మార్చి 17 (బుధవారం)