మంత్రి శ్రీనివాస్ గౌడ్ తండ్రి నారాయణ గౌడ్ మృతిపట్ల పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఇవాళ మధ్యాహ్నం మహబూబ్నగర్ పట్టణం శ్రీనివాస కాలనీలో ఉన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంటికి చేరుకున్న కేటీఆర్..నారాయణ గౌడ్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం మంత్రి శ్రీనివాస్ గౌడ్తో మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకున్నారు. నారాయణ గౌడ్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. మంత్రి కేటీఆర్తో పాటు ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు ఉన్నారు.
