ఏపీలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ప్రకటన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జరగబోయే ఎమ్మెల్యే కోటాలోని ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఈ మేరకు గురువారం పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు. అలాగే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధిని నిలబెట్టడం లేదని ఆయన పేర్కొన్నారు.

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు

► చల్లా భగీరథరెడ్డి
► బల్లి కల్యాణ చక్రవర్తి
► సి.రామచంద్రయ్య
► మహ్మద్ ఇక్బాల్
►దువ్వాడ శ్రీనివాస్‌
►కరీమున్నీసా