అక్షయపాత్ర పనితీరుపై స్పందించడం బాగుందని, మీరు ‘‘స్టీల్ లేడీ ’’అని స్పీకర్ తమ్మినేని సీతారాం సతీమణి వాణీసీతారాంను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రశంసించారు. తొగరాం సర్పంచ్గా గెలుపొందిన ఆమె స్పీకర్తో సీఎంను బుధవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వాణమ్మకు అభినందనలు తెలిపారు. ఈ క్రమంలో జిల్లాలో పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. జగనన్న గోరుముద్ద పథకానికి సన్నబియ్యం అందించాలని వాణమ్మ కోరగా, వెంటనే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
