తెలంగాణలో నేటితో నైట్ కర్ప్యూ ముగుస్తుండటంతో తదుపరి చర్యలపై హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. మే 8 ఉదయం ఐదు గంటల వరకు రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంటుందని తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వం జీవో జారీ చేసింది.
నైట్ కర్ఫ్యూ ముగియడానికి 24 గంటల సమయం కూడా లేదు.. ప్రభుత్వం తదుపరి చర్యలపై ఇంకా నిర్ణయం తీసుకోకపోవడం ఏంటని కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. 45 నిమిషాల్లోగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే తాము ఆదేశాలు ఇస్తామని స్పష్టం చేసిన సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కర్ఫ్యూ పొడగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.