రాష్ట్రీయ లోక్‌ద‌ళ్‌ అధ్య‌క్షుడు చౌద‌రి అజిత్ సింగ్ క‌న్నుమూత‌

పెరుగుతున్న కరోనా వ్యాప్తి మ‌రింత వినాశనానికి దారితీస్తోంది. తాజాగా రాష్ట్రీయ‌ లోక్‌దళ్(ఆర్ఎల్‌డీ) అధ్యక్షుడు చౌదరి అజిత్ సింగ్ క‌రోనాతో కన్నుమూశారు. కరోనా బారిన ప‌డిన ఆయ‌న గురుగ్రామ్‌లోని మెదాంత ఆసుప‌త్రిలో చేరి, చికిత్స పొందుతూ క‌న్నుమూశారు. 82 సంవత్సరాల వయసులో చౌదరి అజిత్ సింగ్ తుది శ్వాస విడిచారు. చౌదరి అజిత్ సింగ్ ఏప్రిల్ 22 న కరోనా బారిన పడ్డారు. అనంత‌రం చికిత్స కోసం గురుగ్రామ్‌లోని మేదాంత‌ ఆసుపత్రిలో చేరారు. ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ కారణంగా అతని పరిస్థితి ఆందోళ‌న‌క‌రంగా మారింది. చికిత్స పొందుతూ ఆయ‌న క‌న్నుమూశారు.