ఇటీవల తెలంగాణలో జరిగిన రెండు కార్పొరేషన్, ఐదు మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీ టీఆర్ఎస్ విజయకేతనం ఎగరవేసింది. అన్ని మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగిరింది. ఇక కార్పొరేషన్లకు మేయర్, ఉప మేయర్, మున్సిపాలిటీలకు చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల విషయమై టీఆర్ఎస్ సమాలోచనలు చేసి ఎట్టకేలకు వారిని ప్రకటించింది. శుక్రవారం ఉదయమే రెండు కార్పొరేషన్లకు మేయర్లను ప్రకటించిన అధికార పార్టీ సాయంత్రానికి మున్సిపాలిటీలకు చైర్మన్లు వైస్ చైర్మన్లు ఎవరో తెలిపింది. సామాజిక వర్గాల వారీగా లెక్కలు వేయడంతో పాటు మహిళలకు పెద్ద పీట వేసేలా టీఆర్ఎస్ వారిని నియమించింది.
సిద్దిపేట మున్సిపల్
చైర్పర్సన్: కడవేర్గు మంజుల, వైస్ చైర్మన్: జంగిటి కనకరాజు
అచ్చంపేట మున్సిపల్
చైర్మన్: ఎడ్ల నరసింహ గౌడ్, వైస్ చైర్మన్: పోరెడ్డి శైలజారెడ్డి
కొత్తూరు మున్సిపల్
చైర్పర్సన్: బాతుక లావణ్య యాదవ్, వైస్ చైర్మన్: దోలి రవీందర్
జడ్చర్ల మున్సిపల్
చైర్పర్సన్: దోరెపల్లి లక్ష్మీ
నకిరేకల్ మున్సిపల్
చైర్మన్: శ్రీనివాస్గౌడ్