నెల్లూరు జిల్లా వింజమూరు మండలం చండ్రపడియాలో విషాదం చోటు చేసుకుంది. చండ్రపడియాలోని కెమికల్ ఫ్యాక్టరీలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ గ్యాస్ లీకై ముగ్గురు మృతి చెందారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ కెమికల్ ఫ్యాక్టరీలో గతంలోనూ ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఫ్యాక్టరీ యాజమాన్యంపై కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేపట్టారు.