ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ చాలెంజ్ ఆకుపచ్చ తెలంగాణగా వర్ధిల్లుతుందని ఆర్.జి త్రీ జి ఎం సూర్య నారాయణ అన్నారు. ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ చాలెంజ్ అని స్వీకరించి పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని ఆర్.జి త్రీ కార్యాలయ ఆవరణలో ఆర్.జి త్రీ జి ఎం సూర్య నారాయణ వారి స్టాప్ తో మొక్కలు నాటారు. అనంతరం ఆర్జీ 2 జియం సురేష్, జయం ఏపిఏ శ్రీని, రమేష్ బాబు లకు జి ఎం సూర్య నారాయణ గ్రీన్ చాలెంజ్ ను విసిరారు. అనంతరం మాట్లాడుతూ సిఎం కేసిఆర్ మానస పుత్రికైన తెలంగాణ కు హరితహారం స్పూర్తితో ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ పర్యావరణ సమతుల్యత జరగాంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలనే ఉద్దేశ్యం మహా గొప్పదని, గ్రీన్ చాలెంజ్ ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్న ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు. బైట్:- జి ఎం సూర్య నారాయణ