9వ సారి టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడిగా కేసీఆర్‌

తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్‌) అధ్యక్షుడిగా సీఎం కె. చంద్రశేఖర రావు(కేసీఆర్‌) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  టీఆర్‌ఎస్‌ ప్లీనరీ సమావేశంలో కేసీఆర్‌ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.  పార్టీ ప్లీనరీ ఆయనను అధ్యక్షుడిగా ఎన్నుకుంది.  ఫలితంగా 9వసారి పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్‌ బాధ్యతలు చేపట్టారు. రెండు దశాబ్దాల ప్రస్థానాన్ని టీఆర్‌ఎస్‌ పార్టీ పూర్తి చేసుకున్న తరుణంలో ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించిన ప్లీనరీ సమావేశానికి పార్టీ నేతలు, కార్తకర్తలు భారీగా తరలివచ్చారు.

దీనిలో  భాగంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. అనేక అపనమ్మకాల మధ్య ఉద్యమానికి శ్రీకారం జరిగిందని, అనేక ఆటుపోట్లు ఎదురయ్యాయి అయినా స్పష్టమైన లక్ష్యంతో ముందుకు కదిలామన్నారు. ఎక్కడ కూడా రాజీలేని పోరాటం చేయడం ద్వారానే తెలంగాణ‌ను సాధించుకున్నామ‌ని స్పష్టం చేశారు.రాష్ట్రాన్ని కలాలకు మతాలకు అతీతంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుంటూ ముం‍దుకు తీసుకెళ్తున్నట్లు  పేర్కొన్నారు. దేశంలో తెలంగాణ ప‌థ‌కాలు ఆదర్శంగా నిలిచాయని అన్నారు. దేశం కంటే తెలంగాణ రాష్ట్రం ముందుందని చెప్పారు.