తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు దీపావళి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆత్మనిర్భర్ స్ఫూర్తితో స్వదేశీ తయారీదారుల జీవితాల్లో కొత్త వెలుగులు తీసుకురావడానికి స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేసి దీపావళి పండుగ జరుపుకోవాలని తమిళిసై ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దీపాల పండుగ చెడుపై మంచి విజయానికి చిహ్నమని అభివర్ణించారు. దీపావళి ప్రజల జీవితాల్లో వెలుగులు తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ కొవిడ్ నిబంధనలు పాటిస్తూ వేడుకలు జరుపుకోవాలని ఆమె కోరారు.
