రాజేంద్రనగర్‌లో ఓ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం..

హైదరాబాద్‌ నగర శివార్లలోని రాజేంద్ర నగర్‌లో ఉన్న ఓ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం (Fire accident) జరిగింది. మైలర్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వినాయక్‌నగర్ బస్తిలో ఉన్న కాటన్ బెడ్, మెత్తలు తయారుచేసే కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి పరిశ్రమ మొత్తానికి విస్తరించాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

పరిశ్రమలో కాటన్ వేస్ట్ వుండటంతో భారీఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. దీంతో మంటలను అదుపుచేయడాని ఫైర్‌ సిబ్బంది గంట పాటు శ్రమించాల్సి వచ్చింది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.