28న అగ్రిగోల్డ్‌ బాధితుల సంఘం సమావేశం

అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేయాలన్న డిమాండ్‌తో ఈ నెల 28న సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దూంభవన్‌లో అగ్రిగోల్డ్‌ బాధితుల సంఘం రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించనుంది. దీనికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌, సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులను ఆహ్వానించినట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాలమల్లేశ్‌ వెల్లడించారు.