రాజ్యసభకు వద్దిరాజు రవిచంద్ర నామినేషన్‌ దాఖలు

రాజ్యసభ స్థానానికి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వద్దిరాజు రవిచంద్ర నామినేషన్‌ దాఖలు చేశారు. అసెంబ్లీలో రిటర్నింగ్‌ అధికారికి గురువారం ఆయన నామినేషన్‌ పత్రాలను సమర్పించారు. బండ ప్రకాశ్‌ రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికకు ఆయన నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా రవిచంద్రను మంత్రులు పువ్వాడ అజయ్‌కుమార్‌, గంగుల కమలాకర్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి, శ్రీనివా్‌సగౌడ్‌, కొప్పుల ఈశ్వర్‌, తలసాని తదితరులు అభినందించారు.