ఏఐసీసీ కార్యదర్శిగా దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

ఏఐసీసీ కార్యదర్శిగా ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబును కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ నియమించారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. శ్రీధర్‌బాబుతో పాటు మరో నలుగురు ఏఐసీసీ కార్యాదర్శులకు కర్ణాటక బాధ్యతలు అప్పగించారు.