కాకినాడ ప్యారీ షుగర్‌ కంపెనీలో మరోసారి ప్రమాదం.. ఇద్దరు మృతి

కాకినాడ జిల్లాలో వాకలపూడి పారిశ్రామిక ప్రాంతంలోని ప్యారీ షుగర్స్ రిఫైనరీలో మరోసారి పేలుడు సంభవించింది. సోమవారం కార్మికులు పనులు చేస్తుండగా.. ఫ్యాక్టరీలోని మిషనరీ ఎక్విప్‌మెంట్ సెక్షన్‌లో వాక్యామ్‌ గడ్డర్‌ (భారీ పైపు) పడి ఇద్దరు కార్మికులు మృతిచెందారు. మృతులను సుబ్రహ్మణ్యం(30), ప్రసాద్‌(35)గా గుర్తించారు. కాగా, వారి మృతితో పరిశ్రమ వద్ద కార్మికులు ఆందోళనకు దిగారు. 

ఇక ప్యారీ షుగర్స్ కంపెనీలో 10 రోజుల వ్యవధిలోనే రెండోసారి ప్రమాదం చోటుచేసుకోవడం కార్మికులను భయాందోళనకు గురిచేసింది. ఇదే పరిశ్రమలో ఆగష్టు 19వ తేదీన ప్రమాదంలో ఇద్దరు కార్మికులు చనిపోయారు. కాగా, రిఫైనరీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా కన్వేయర్ బెల్ట్ పేలడంతో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో తొమ్మిది మంది గాయపడ్డారు.