
జనగామలోని ఓ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్ లోని తారా ఫ్యాక్టరీలో రియాక్టర్ కు ఛార్జింగ్ పెడుతుండగా హఠాత్తుగా మంటలు చెలరేగాయి. ఫ్యాక్టరీ నుంచి భారీ ఎత్తున మంటలు ఎగిసి పడుతున్నాయి. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.