వచ్చే ఆర్థిక సంవత్సరం ( 2023-24) కి సంబంధించిన బడ్జెట్ను కేంద్రం ప్రవేశపెట్టింది. లోక్సభలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం చదివి వినిపించారు. పార్లమెంటులో బడ్జెట్ ప్రశపెట్టడం నిర్మలా సీతారామన్కు ఇది ఐదోసారి. ఈ బడ్జెట్ ముఖ్యాంశాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
- ప్రపంచమంతా ఇప్పుడు భారత్వైపు చూస్తోంది. అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు దేశం సిద్ధంగా ఉంది. ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ భారత్. ఈపీఎఫ్వో సభ్యుల సంఖ్య రెట్టింపు అయ్యింది. డిజిటల్ చెల్లింపులు బాగా పెరిగాయి.
- కళాకారుల బ్రాండ్ ప్రమోషన్కు చర్యలు తీసుకుంటున్నాం. కళాకారులు, హస్తకళాకారులకు ప్రత్యేక రాయితీలు అందిస్తున్నాం. ఎంఎస్ఎంఈలతో కళాకారులను అనుసంధానం చేస్తున్నాం.
- టూరిజం రంగంలో భారత్కు అనేక అవకాశాలు ఉన్నాయి. పర్యాటక రంగ ప్రోత్సాహానికి విస్తృత చర్యలు చేపట్టాం. హరిత ఇంధనం కోసం పటిష్ఠమైన చర్యలు చేపట్టాం.
సప్తరుషుల రీతిలో బడ్జెట్లో ఏడు అంశాలకు ప్రాధాన్యత. సమిష్ఠి ప్రగతి దిశగా అనేక చర్యలు చేపడుతున్నాం.
7 ప్రధాన అంశాలే ఎంజెండా
ఈ బడ్జెట్ల లో 7 అంశాలకు ప్రాధాన్యం కల్పిస్తున్నట్లుగా నిర్మలా సీతారామన్ తెలిపారు.
- చివరి వ్యక్తికి కూడా అభివృద్ధి ఫలాలు
- మౌలిక సదుపాయాలు, పెట్టుబడలు
- సామర్థ్యాల వెలికితీత
- స్వచ్ఛ పర్యావరణ అనుకూల అభివృద్ధి
- యవశక్తి
- విత్త విధానం
- అర్థిక విధానాన్ని బలపరచడం
నీతి ఆయోగ్ మరో మూడేళ్లపాటు పొడిగింపు
కాలం చెల్లిన వాహనాల తొలిగింపుకు తక్షణ ప్రాధాన్యం
కేంద్రప్రభుత్వ వాహనాలు మార్చేందుకు ప్రత్యేక నిధులు
కొత్త వాహనాల కొనుగోలుకు రాష్ట్రాలకు సాయం అందిస్తాం
కేంద్ర బడ్జెట్ లో కేటాయింపులు
- మత్యశాఖకు రూ. 6 వేల కోట్లు
- క్లీన్ ప్లాంట్ కార్యక్రమానికి రూ, 2 వేల కోట్లు
- ఎస్సీ వర్గాలకు రూ. 15 వేల కోట్లు
- పీఎం ఆవాస్ యోజన్ పథకానికి రూ.79 వేల కోట్లు
- గిరిజనుల అభివృద్ధికి రూ.15 వేల కోట్లు
- రైల్వేలకు రూ.2.04 లక్షల కోట్లు
- ఆత్మ నిర్భర్ భారత్ క్లీన్ పథకం ఉద్యానవన పంటకు చేయూత
- చిరుధాన్యాల పంటలకు సహకారం. ఇందుకోసం ‘శ్రీఅన్న’ పథకం. రాగులు, జొన్నలు, సజ్జలు తదితర పంటలకు ప్రోత్సాహం
వ్యవసాయం
- రైతులకు రూ.20లక్షల కోట్లు వ్యవసాయ రుణాలు అందిస్తాం
- వ్యవసాయం కోసం డిజిటల్ ప్రభుత్వ మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. వ్యవసాయ రంగానికి రుణ సదుపాయం, మార్కెట్ సదుపాయం అందిస్తున్నాం.
- వ్యవసాయ స్టార్టప్స్కు చేయూత, ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తున్నాం. రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాం.
- పత్తి సాగు మెరుగుదల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. పత్తి కోసం ప్రత్యేకంగా మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తున్నాం.
- చిరుధాన్యాలు ఎగుమతిలో భారత్ అగ్రస్థానంలో ఉంది. చిరుధాన్యాల ప్రాధాన్యత పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. జొన్న, రాగి, బార్లీ, ఇలా ఎన్నో సిరిధాన్యాలు పండిస్తున్నాం.
- మత్యకారుల కోసం రూ.6వేల కోట్లు
- 11.7 కోట్ల మందికి ఉచితంగా టాయిలెట్స్ నిర్మించి ఇచ్చాం. మహిళల కోసం మరిన్ని పథకాలు అమలు చేశాం. 81 లక్షల స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేస్తాం. పీఎం విశ్వకర్మ యోజన తీసుకొస్తాం.
- సికిల్ సెల్ వ్యాధిగ్రస్తులకు ప్రత్యేక చేయుత అందిస్తాం. ప్రైవేటు ప్రభుత్వ పరిశోధనల కోసం ICMR ల్యాబ్స్ ఏర్పాటు
- పంచాయతీ స్థాయిలో పాఠశాల విద్యార్థుల కోసం ప్రత్యేకంగా నేషనల్ డిజిటల్ లైబ్రరీలు ఏర్పాటు
- విద్యార్థుల్లో చదువుపై ఆసక్తిపెంచేందుకు చర్యలు చేపట్టాం. ప్రాంతీయ భాషల్లో NBT ద్వారా మరిన్ని పుస్తకాలు అందజేస్తాం.
- ఏకలవ్య పాఠశాలల్లో 38,800 టీచర్ల నియామకం
- PVTG గిరిజనుల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. మారుమూల గిరిజన గ్రామాల అభివృద్ధి కోసం రూ.15వేల కోట్లు కేటాయించాం.
- కర్ణాటకలోని కరవు పీడిత ప్రాంతాలకు రూ. 5వేల కోట్లు
- PMAY కోసం రూ.79వేల కోట్లు
- పురాతన తాళపాత్రల డిజిటలైజేషన్ కోసం ప్రత్యే చర్యలు.
- దళితుల అభివృద్ధికి ప్రత్యేక పథకాలు తీసుకొస్తున్నాం. సహకార సంఘానికి బడ్జెట్లో పెద్ద పీట. పీఎం ఆవాస్ యోజనకు 66 శాతం నిధుల పెంపు
- మెడికల్ కాలేజీలతో పాటు దేశవ్యాప్తంగా 157 నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేస్తాం.
- ఎస్సీ వర్గాలకు రూ.15వేల కోట్లు కేటాయింపు
- రైల్వేకు రికార్డు స్థాయిలో నిధుల కేటాయింపు
- రైల్వేలకు రూ.2.40 లక్షల కోట్ల కేటాయింపు. కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి పెద్దపీట
- మౌలిక వసతుల అభివృద్ధికి 33 శాతం నిధులు. మూల ధనం కింద రూ.10 లక్షల కోట్లు
- పేద ఖైదీలకు బెయిల్ పొందేందుకు ఆర్థిక సాయం
- డిజిటల్ సిస్టమ్స్ కోసం గుర్తింపు ఆధారంగా ఇక PAN . ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు గుర్తింపు కార్డు పాన్ నెంబర్
- గతంలో కట్టిన బిడ్స్ మొత్తం ఎంఎస్ఎంఈలకు తిరిగి చెల్లిస్తాం.
- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు
- మేక్ ఇన్ ఇండియా.. మేక్ ఏ వర్క్ మిషన్ ప్రారంభం
- స్టార్టప్లకు ప్రత్యేక ప్రోత్సాహం. స్టార్టప్లకు రిస్క్ తగ్గించేందుకు కృషి
- KYC ప్రక్రియ సులభతరం చేయాలని నిర్ణయం
- కర్ణాటకలోని వెనుకబడ్డ ప్రాంతాలకు, సాగు రంగానికి రూ.5300 కోట్లు
- నేషనల్ హైడ్రోజన్ గ్రీన్ మిషన్కు రూ.19,700 కోట్ల కేటాయింపు
- విద్యుత్ రంగానికి రూ.35వేల కోట్ల కేటాయింపు
- నిరుద్యోగుల కోసం పీఎం కౌశల్ పథకం నాలుగో దశ ప్రారంభం
- పీఎం కౌశల్ పథకం కింద 4 లక్షల మందికి శిక్షణ
- పర్యాటకరంగ ప్రోత్సాహానికి ప్రత్యేక చర్యలు. ఛాలెంజ్ విధానంలో దేశవ్యాప్తంగా 50 ప్రాంతాల ఎంపిక.. 50 టూరిస్ట్ స్పాట్ల అభివృద్ధికి ప్రత్యేక నిధులు
- దేఖో ఆప్నా దేఖ్ పథకం ప్రారంభం
- స్వదేశ ఉత్పత్తుల అమ్మకానికి దేశవ్యాప్తంగా యూనిటీ మాల్స్
- మహిళల కోసం అధిక వడ్డీతో ప్రత్యేకంగా మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ పథకం ప్రారంభం.
- రాష్ట్రాలకు 50 ఏళ్ల పాటు వడ్డీ లేని రుణాలు. మూల ధన వ్యయం పెంచేందుకు రాష్ట్రాలకు చేయూత
- రోడ్లు, రహదారుల నిర్మాణానికి రూ.75వేల కోట్ల కేటాయింపు
- పలు వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ 23 శాతం నుంచి 23 శాతానికి తగ్గించాం. ఎలక్ట్రిక్ వాహనాలపై కస్టమ్స్ డ్యూటీ, టీవీ ప్యానెళ్ల ధరలు తగ్గించాం