ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న సువెన్ ఫార్మా కంపెనీ
సువెన్ ఫార్మని సీజ్ చేయాలని సీపీఐ(ఎం.ఎల్) ప్రజాపంథా సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి, ఏఓ శ్రీదేవికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ మాట్లాడుతూ సువెన్ ఫార్మని 1989 లో జాస్తి వెంకటేశ్వరరావు కోటి రూపాయల పెట్టుబడితో 10 ఎకరాల్లో విస్తరించి ఇక్కడ వచ్చిన లాభాలతో ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలలో అనేక ఫార్మా కంపెనీలు నెలకొల్పారు. అమాయక గిరిజనులు వద్ద ఒక లక్ష నుండి 3 లక్షలకు రూపాయలకు ఎకరం కొని 100 ఎకరాలు చేసి ఆ కంపెనీని 650కోట్లకు విదేశీ కంపెనీకి అమ్ముకొని అమాయక గిరిజసులను మోసం చేశాడనీ విమర్శించారు. 2018 నుండి మరో కొత్త ప్లాంట్ ఓపెన్ చేయాలనీ చూస్తున్నారు. ఇది పొరపాటున బ్లాస్ట్ అయితే చుట్టూ 10 కిలో మీటర్లు స్మశానం అవుతుంది అన్నారు. దీనితో పాటు ఇక్కడ ఉన్న భూమి, నీరు, గాలి కాలుష్యం వల్ల ఇక్కడ పండే పంటలు కలుషితమై ఇక్కడి ప్రజలు కిడ్నీ, ఊపిరితిత్తులు మరియు ఇతర వ్యాధులతో బాధపడుతున్నారు. కాబట్టి జాస్తి వెంకటేశ్వర రావుకి లాభం 650 కోట్లలో 325 కోట్లు కంపెనీ వల్ల నష్టపోయిన కుటుంబాలకు ఇవ్వాలని, తక్షణమే ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నా సువెన్ ఫార్మా కంపెనినీ సీజ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పిఓడబ్ల్యు జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి రేణుక, పిడిఎస్ యు రాష్ట్ర సహయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్, పార్టీ జిల్లా నాయకులు పేర్ల నాగయ్య, ఐఎస్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా రాంజీ, పిఓడబ్ల్యు జిల్లా అధ్యక్షులు చంద్రకళ, సహయ కార్యదర్శి సంతోషి మాతా, ఐఎఫ్టియు జిల్లా నాయకులు జీవన్, శైలజ, పద్మ, పుష్ప, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.