పిసిబి మెంబర్ సెక్రటరీగా డా.జ్యోతి బుద్ద ప్రకాశ్

తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి పిసిబి మెంబర్ సెక్రటరీగా డా.జ్యోతి బుద్ద ప్రకాశ్ బాధ్యతలు స్వీకరించారు. సనత్ నగర్ లోని కాలుష్య నియంత్రణ మండలి ప్రధాన కార్యాలయంలో బాధ్యతలను స్వీకరించిన అనంతరం పిసిబి అధికారులు, సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కాలుష్య నియంత్రణకు కృషి చేయాలని ఆదేశించారు. పర్యావరణ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేసి సానుకూల దృక్పథాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం పిసిబి అధికారులపై ఉందన్నారు.

పర్యావరణ పరిరక్షణ సమతుల్యంగా ఉండాలని, స్థిరమైన అభివృద్ధికి మార్గం సుగమం చేయాలన్నారు. సాంకేతికత బదిలీని ఉపయోగించి, పారిశ్రామిక ఉత్పత్తి మరియు పర్యావరణ సమతుల్యత కోసం కృషి చేయాలని ఆయన అన్నారు. ఇప్పటి వరకు పిసిబి మెంబర్ సెక్రటరీగా పనిచేసి తెలంగాణ కార్మిక శాఖకు బదిలీ అయి వెళ్ళిన పిసిబి సభ్య కార్యదర్శి ఎస్. కృష్ణ ఆదిత్యను ఘనంగా సత్కరించి, వీడ్కోలు పలికారు. పిసిబి చీఫ్ గా ఆయన పనిచేసిన సమయంలో పీసీబీ అధికారులు, సిబ్బంది తమ అనుభవాలను ఈ సందర్భంగా పంచుకున్నారు.