ఈ నెల18న తెలంగాణ భ‌వ‌న్‌లో బీఆర్ఎస్ కీల‌క స‌మావేశం

ఈ నెల 18వ తేదీన తెలంగాణ భ‌వ‌న్‌లో బీఆర్ఎస్ పార్టీ కీల‌క స‌మావేశం నిర్వ‌హించ‌నుంది. ఈ స‌మావేశం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న జ‌ర‌గ‌నుంది. 17 పార్ల‌మెంట్ స్థానాల్లో పోటీ చేయ‌బోతున్న బీఆర్ఎస్ ఎంపీ అభ్య‌ర్థుల‌కు కేసీఆర్ బీ ఫారాలు అంద‌జేయ‌నున్నారు. ఎన్నిక‌ల ఖ‌ర్చు కోసం ఒక్కో అభ్య‌ర్థికి రూ. 95 ల‌క్ష‌ల విలువ చేసే చెక్‌లు ఇవ్వ‌నున్నారు కేసీఆర్. అనంత‌రం పార్టీ నేత‌ల‌తో సుదీర్ఘ స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించ‌నున్నారు.

కాగా.. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన వాగ్దానాలను నమ్మి మోసపోయినామని చింతిస్తున్న తెలంగాణ ప్రజలు.. కేసీఆర్ నాయకత్వాన్ని తిరిగి కోరుకుంటున్న పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్నది. తమ హక్కులు కాపాడబడాలంటే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఆదరించాలని తెలంగాణ ప్రజలు నిర్ణయించుకుంటన్నట్టు సర్వేలు కూడా స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణ ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా అధినేత కేసీఆర్ ప్రచార సరళిని రూపొందించనున్నారు. ఇప్పటికే జరిపిన బహిరంగ సభలకు విపరీతమైన ప్రజా స్పందన వెల్లువెత్తుతున్న నేపథ్యంలో.. తెలంగాణ ప్రజలకు మరింత చేరుకావాలని అధినేత కేసీఆర్ నిర్ణయించారు. కాంగ్రెస్ తెచ్చిన కరువుకు అల్లాడుతున్న రాష్ట్ర రైతాంగం వద్దకు వెల్లి వారి కష్ట సుఖాలను తెలుసుకోవడానికి, వారికి భరోసానివ్వడానికి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రలు నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఏప్రిల్ 18వ తేదీ గురువారం జరగనున్న ఈ సమావేశంలో అధినేత కేసీఆర్ బస్సు యాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్ పై చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారు.