నాంపల్లిలోని నీటిపారుదల శాఖలో ఏసీబీ (ACB) సోదాలు ముగిశాయి. నలుగురు నిందితులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారిని నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి తరలించారు. నాంపల్లిలోని రెడ్హిల్స్ ఉన్న నీటిపారుదల శాఖ ఆఫీసులో గురువారం రాత్రి ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా ఈఈ భన్సీలాల్, ఏఈలు కార్తీక్, నికేశ్లు లంచం తీసుకుంటుంగా రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. అదే సమయంలో లంచం డిమాండ్కు సంబంధించిన కీలక అధికారి పరారీ కావడంతో అర్ధరాత్రి వరకు హైడ్రామా కొనసాగుతున్నది. రాత్రి నాలుగు గంటలపాటు శ్రమించి నాలుగో వ్యక్తిని అధికారులు పట్టుకున్నారు.
కాగా, ఓ వ్యక్తికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఆమెదం కోసం నీటిపారుదల శాఖ రంగారెడ్డి జిల్లా ఎస్ఈ కార్యాలయ అధికారులను సంప్రదించారు. ఇక్కడ ఈఈగా పనిచేస్తున్న భన్సీలాల్, ఏఈలు కార్తీక్, నికేశ్ రూ.2.5 లక్షలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలిసింది. దానికి అంగీకరించిన సదరు వ్యక్తి ముందుగా రూ.1.5 లక్షలు ఇచ్చేందుకు అధికారులు ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే దీనికి సంబంధించి బాధితులు ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో అధికారులు దాడులు జరిపి వారిని రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.