కంటోన్మెంట్‌ ఉప ఎన్నికల్లో శ్రీ గణేష్ విజయం

కంటోన్మెంట్‌ ఉప ఎన్నికల్లో(Cantonment By-elections) కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ గణేష్(Shri Ganesh) విజయం సాధించారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి దివంగత మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే కూతురు నివేదితపై 9,725 ఓట్లతో శ్రీ గణేష్ ఘన విజయం సాధించారు. కాగా, కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మృతితో 2023లో జరిగిన ఎన్నికల్లో ఆయన పెద్ద కుమార్తె లాస్య నందిత బీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసి గెలిచింది. కాగా, కొన్ని నెలలకే సంగారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె మృతి చెందడంతో ఉప ఎన్నిక జరిగింది.